Tuesday 10 April 2012

పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాటే హైలెట్

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ఆడియో త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఆడియోలో మరో విశేషం చోటు చేసుకున్నదని తెలుస్తోంది. అది మరేదో కాదు..పవన్ స్వయంగా గొంతు సవరించటం. గతంలో జానీ,తమ్ముడు,ఖుషీ చిత్రాలలో పాడిన పవన్ మరో సారి ఈ అభిమానులను అలరించటానికి పాట పాడారని విశ్వసనీయ సమాచారం. హరీష్ శంకర్ రిక్వెస్ట్ మేరకు పాడిన ఆ పాట పక్కా మాస్ సాంగ్ అని ...ఆడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుందని చెప్తున్నారు. ఇక 'గబ్బర్‌సింగ్'ఆడియో ఈ నెల 15న హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో జరుగుతోంది. ఈ ఆడియో పంక్షన్ లో బాబా సెహగల్ తన సంగీతం తో అలరించనున్నారు.


శృతిహాసన్ హీరోయిన్ గా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం అడియో గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ..ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తోందని, రికార్డులు సృష్టించే చిత్రంగా వుందని అందరూ చెప్పడం సంతోషంగా వుందని తెలిపారు. మే 9న వేసవి సెలవులకు విడుదలయ్యే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు. హరీష్ శంకర్ ఎస్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. 

ఇక ఈ ఆడియో గురించి నిర్మాత గణేశ్ మాట్లాడుతూ.. 'మా సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటికి తగ్గట్లుగా చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. పవన్‌కళ్యాణ్‌గారి కెరీర్‌లోనే నెంబర్‌వన్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. ఇటువంటి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా హీరోగారికి కృతజ్ఞతలు. దర్శకుడు హరీశ్‌శంకర్ సినిమాని బాగా తీశారు. ఈ నెల 15న ఆడియోని, మేలో సినిమాని విడుదల చేస్తాం' అన్నారు.

No comments:

Post a Comment